🆕 LATEST

ఓటింగ్‌కు 18 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి

మున్సిపల్ ఎన్నికలు: ఓటింగ్‌కు 18 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి ప్రతి ఓటరు తప్పనిసరిగా గుర్తింపు పత్రం తీసుకురావాలి: కలెక్టర్ హనుమంత రావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా ఈ నెల 11న నిర్వహించనున్న భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు సూచించారు. ఓటింగ్ […]

అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

చిట్యాల అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే: ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ NTODAY NEWS: చిట్యాల చిట్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కనకదుర్గ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మల దగ్ధం

    కార్మిక–రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మల దగ్ధం సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో చిట్యాలలో నిరసన కార్యక్రమం NTODAY NEWS: చిట్యాల కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారనే ఆరోపణలతో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను సోమవారం సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకుడు […]

రాయికల్‌లో గులాబీ జెండా ఖాయం

రాయికల్‌లో గులాబీ జెండా ఖాయం: బీఆర్‌ఎస్ నేతల ధీమా అవినీతి లేని అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి మీడియా సమావేశంలో దావ వసంత సురేష్, రాజేశం గౌడ్ పిలుపు NTODAY NEWS:  గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాయికల్ పట్టణంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం రాయికల్ పట్టణంలో మాజీ మంత్రి రాజేశం గౌడ్‌తో కలిసి బీఆర్‌ఎస్ […]

ధర్మపురిలో కాంగ్రెస్ భారీ ఎన్నికల ర్యాలీ

అవినీతి చేతుల్లో మున్సిపాలిటీ పెడితే పట్టణానికి ప్రమాదం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలో కాంగ్రెస్ భారీ ఎన్నికల ర్యాలీ మున్సిపల్ అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ధర్మపురి మున్సిపాలిటీని అవినీతి పరుల చేతుల్లో అప్పగిస్తే పట్టణం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధిగా మలిచినట్లు పేర్కొన్న ఆయన, ఈ […]

కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి

కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి: దావ వసంత సురేష్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్  మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 38వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం ఉత్సాహంగా సాగింది. సోమవారం బీఆర్‌ఎస్ అభ్యర్థి తాడెపు మానస మహేశ్‌కు మద్దతుగా జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె […]

ధర్మపురిలో మంత్రి అడ్లూరి విస్తృత పర్యటన

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ధర్మపురిలో మంత్రి అడ్లూరి విస్తృత పర్యటన NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజున ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం హోరెత్తింది. వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్టణంలో విస్తృతంగా పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వెల్గటూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా ముందుకు […]

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వేముల వీరేశం NTODAY NEWS: చిట్యాల పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం చిట్యాల 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సిలివేరు శేఖర్‌కు మద్దతుగా ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతోందని […]

బీఆర్‌ఎస్ కార్నర్ మీటింగ్స్‌కు భారీ స్పందన

జగిత్యాలలో బీఆర్‌ఎస్ కార్నర్ మీటింగ్స్‌కు భారీ స్పందన బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం: ఎల్. రమణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్  మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 40, 42, 49 వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్స్ హోరెత్తాయి. ఈ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మంత్రి రాజేశం గౌడ్ పాల్గొని అభ్యర్థులకు […]

15 వార్డుల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలి

అభివృద్ధికి పట్టం కట్టాలి.. 15 వార్డుల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలి ఎన్నికల ప్రచారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్  నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని 5, 8, 14వ వార్డుల్లో శనివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌ల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గత పాలనపై విమర్శలు చేసిన మంత్రి, అభివృద్ధి […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »