
మున్సిపల్ ఎన్నికలు: ఓటింగ్కు 18 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి
ప్రతి ఓటరు తప్పనిసరిగా గుర్తింపు పత్రం తీసుకురావాలి: కలెక్టర్ హనుమంత రావు
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
ఈ నెల 11న నిర్వహించనున్న భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు సూచించారు.
ఓటింగ్ సమయంలో 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదాన్ని చూపించవచ్చని తెలిపారు. గుర్తింపు పత్రం లేకుండా ఓటింగ్కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
ఓటింగ్కు అనుమతించే గుర్తింపు కార్డులు:
-ఓటర్ ఐడీ కార్డు
-ఆధార్ కార్డు
-ఉపాధి హామీ జాబ్ కార్డు
-ఫోటోతో కూడిన బ్యాంక్ పాస్బుక్
-ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్ పాస్బుక్
-కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
-డ్రైవింగ్ లైసెన్స్
-పాన్ కార్డు
-లేబర్ గుర్తింపు కార్డు
-భారతీయ పాస్పోర్ట్
-ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్
-కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు
-ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు
-దివ్యాంగుల గుర్తింపు కార్డు
-ఇతర అధికారిక ఫోటో గుర్తింపు కార్డులు
ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
#MunicipalElections
#VotingDay
#VoterAwareness
#ElectionCommission
#UseYourVote
#Democracy
#YadadriBhuvanagiri
#CivicResponsibility













