N TODAY NEWS: బొమ్మలరామారం మండలం,మార్చ్31
యాదాద్రి భువనగిరి జిల్లా,బొమ్మలరామారం మండలం, కాజిపేట గ్రామ శివార్లలో షామీర్ పేట వాగులో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. మృతుడి వయస్సు సుమారు 30-35 సంవత్సరాల వయస్సు ఉంటుంది. మృతుడు డొంకేన కిష్టయ్య వ్యవసాయ భూమి పక్కన గల షామీర్ పేట వాగులోగల గుంటలో చేపలు పట్టడానికి దిగి ఈతరాక మునిగిపోయి చనిపోయినట్లుగా ఉండవచ్చని మృతుడు నలుపు రంగు షర్టు పైన పెసర రంగు టీ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసినచో బొమ్మలరామారం SHO శ్రీశైలం సెల్ నెంబర్ 8712662474 కు తెలియజేయగలరు అని నేడు ఒక ప్రకటనలో తెలిపారు