భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు

Spread the love

జూన్ మూడవ తారీకు నుండి బొమ్మలరామారం మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు,సద్వినియోగం చేసుకోవాలన్న మండల తహసిల్దార్ పి. శ్రీనివాసరావు.

NTODAY NEWS: బొమ్మలరామారం మండలం, జూన్ 01 యాదాద్రి భువనగిరి జిల్లా,

బొమ్మలరామారం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై మండలంలోని 35 గ్రామాలలో రైతులకు, ప్రజలకు జిల్లా కలెక్టర్ ఆదేశాననుసారం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని మండల తాహసిల్దార్ పి.శ్రీనివాసరావు నేడు ఒక ప్రకటనలో తెలిపారు ఈ అవగాహన సదస్సులు జూన్ మూడో తారీకు నుండి 20 తారీకు వరకు వివిధ గ్రామాల్లో భూభారతి చట్టంపై రైతులకు, గ్రామ ప్రజలకు రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు 3వ తేదీన హాజీపూర్ గ్రామపంచాయతీ ఉదయం 8 గంటల నుండి ఒకటి గంటల వరకు, మసిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ నందు రెండు గంటల నుండి 5 గంటల వరకు, 4వ తేదీన మునిరాబాద్ గ్రామపంచాయతీ నందు ఉదయం 8 గంటల నుండి ఒకటి గంటల వరకు బండకాడపల్లి గ్రామపంచాయతీ నందు రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు, 5వ తేదీన మేడిపల్లి గ్రామపంచాయతీ నందు ఉదయం 8 గంటల నుంచి ఒంటి గంట వరకు మరియు మైలారం గ్రామపంచాయతీ నందు రెండు గంటల నుండి 5 గంటల వరకు, 9వ తేదీన జలాల్పూర్ గ్రామపంచాయతీ నందు ఎనిమిది గంటల నుండి 1:00 వరకు యావపూర్ తండా గ్రామపంచాయతీ నందు మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు,10 తేదీన సోలిపేట గ్రామపంచాయతీ నందు ఉదయం 8 నుండి 1:00 వరకు ప్యారారం గ్రామపంచాయతీ నందు మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు, 11వ తేదీన తిరుమలగిరి గ్రామపంచాయతీ నందు ఉదయం 8 గంటల నుండి ఒకటి గంటల వరకు మల్యాల గ్రామపంచాయతీ నందు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు, 12వ తేదీన తిమ్మాపూర్ గ్రామపంచాయతీ నందు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంట వరకు, 13వ తేదీన పెద్దా పర్వతాపురం గ్రామపంచాయతీ నందు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రంగాపురం గ్రామపంచాయతీ నందు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు, 16వ తేదీన సోమాజిపల్లి గ్రామపంచాయతీ ఉదయం 9 గంటల నుండి ఒంటిగంట వరకు బోయినపల్లి గ్రామపంచాయతీ నందు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు, 17వ తేదీన రామలింగంపల్లి గ్రామపంచాయతీ నందు ఉదయం 8 గంటల నుండి ఒంటిగంట వరకు తూముకుంట గ్రామపంచాయతీ నందు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు, 18వ తేదీన నాగినేనిపల్లి గ్రామపంచాయతీ నందు ఉదయం 8 గంటల నుండి ఒంటిగంట వరకు, బొమ్మలరామారం గ్రామపంచాయతీ నందు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు, 19వ తేదీన చీకటి మామిడి గ్రామపంచాయతీ నందు ఉదయం 8 గంటల నుండి 5 గంటల వరకు, 20వ తేదీన మర్యాల గ్రామపంచాయతీ నందు ఉదయం 8 గంటల నుండి 5 గంటల వరకు అవగాహన సదస్సులు ఉంటాయని తెలిపారు. ఈ అవగాహన సదస్సులకు టీం లీడర్లుగా తాహసిల్దార్ పి .శ్రీనివాసరావు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కే.వెంకట్ రెడ్డి, మండల అసిస్టెంట్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ డి.నరేష్ నాయక్, మండల సర్వేయర్ కె.శ్రీనివాస్ మరియు మెంబర్లుగా డి.రమేష్, కే.నరసింహ, మల్లేష్, ప్రకాష్, ఐలయ్య, ధనరాజ్, గణేష్, నాగార్జున, ఎస్.రాజు, విజయ్, డి.శంకర్ ఉంటున్నట్లుగా తహసిల్దార్ తెలిపారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top