News Headlines

ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ బిజెపి కొవ్వొత్తుల నిరసన

Spread the love

ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ.. బిజెపి కొవ్వొత్తుల నిరసన

కొండపల్లి,ఆంధ్రప్రదేశ్.

జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొండపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. దేశంలో అశాంతి,అలజడులు సృష్టించాలని తీవ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, వీటిని భారత ప్రజలందరూ ఖండించాలని బిజెపి మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదని… భారత సైన్యం ధీటైన జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. పాకిస్తానీ తీవ్రవాదులను ఏరి వేసేందుకు భారత ప్రభుత్వం ఘాట్ గా స్పందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపాలిటీ అధ్యక్షురాలు తమ్మినేని మాధురి తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top