తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం నల్లజర్ల లోని: ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల ప్రధానం
నల్లజర్ల, ఏప్రిల్ 15:
ప్రగతి అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ పార్డ్ ఇండియా నల్లజర్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహితమైన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో మొదటి బ్యాచ్లో (అక్టోబర్ 14 నుండి జనవరి 31 వరకు) శిక్షణ పూర్తి చేసుకున్న 55 మంది మహిళలకు పార్డ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ సినీ & టీవీ నటుడు బాలాజీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేయబడ్డాయి. ఈ విషయాన్ని పార్ద్ ఇండియా జాతీయ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు తెలిపారు.ఈ సందర్భంగా మొల్లేటి బాలాజీ మాట్లాడుతూ, మహిళల స్వయం సమృద్ధి మరియు ఆర్థిక స్వావలంబనకు కుట్టు శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని, ఈ దిశగా పార్డ్ ఇండియా చేస్తున్న కృషిని ప్రశంసించారు.మండల శాఖ అధ్యక్షులు ఇలియాజ్ షరీఫ్ మాట్లాడుతూ, మొదటి బ్యాచ్ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, ప్రస్తుతం రెండవ బ్యాచ్లో 45 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారని, ఈ కేంద్రం మండలంలోని అనేక మహిళలకు ఉపాధి మార్గంగా మారుతుందని వెల్లడించారు.ఎడ్యుకేషన్ అవేర్నెస్ చైర్మన్ బొందల శ్రీనివాసరావు మాట్లాడుతూ, శిక్షణ పొందిన మహిళలు ఈ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రభుత్వ రుణ సహాయంతో స్వయం ఉపాధి మరియు ఆర్థికాభివృద్ధిని సాధించాలని సూచించారు.కార్యక్రమంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి కూరపాటి నాగరాజు, గౌరవాధ్యక్షులు చీమకుర్తి ప్రసాద్, ఉపాధ్యక్షులు పచ్చిగోళ్ళ శ్రీనివాసరావు, ట్రెజరర్ జి.ఎన్.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.