News Headlines

భవిష్యత్ తరాలకు ఆదర్శ రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు

Chief Minister Chandrababu Naidu is an ideal royal jurist for future generations
Spread the love

భవిష్యత్ తరాలకు ఆదర్శ రాజనీతిజ్ఞుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

జంపాల సీతారామయ్య

ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు

అభిమాన నాయకుడు జన్మదిన సందర్భంగా సర్వమత ప్రార్థనలు, రోగులకు పండు పంపిణీ అన్నదాన కార్యక్రమం

ఇబ్రహీంపట్నం/కొండపల్లి
————————————-
చరిత్రలో అందరికీ గుర్తుండిపోయే భవిష్యత్తు తరాలకు ఆదర్శ రాజ నీతిజ్ఞుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య.తమ అభిమాన నాయకుడు జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇబ్రహీంపట్నం మరియు కొండపల్లిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జంపాల సీతారామయ్య పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ అభిమాన నాయకుడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నంలో పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వయంగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించి నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జంపాల మాట్లాడుతూ అతలాకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ప్రతి కార్యకర్తగా ఆయన ఆదర్శంగా తీసుకొని పార్టీ విధేయులుగా పనిచేయాలని సూచించారు. ఇలాంటి నాయకుడు దొరకటం రాష్ట్ర ప్రజల అదృష్టమని… ఆయన సారథంలో పనిచేయటం ప్రతి కార్యకర్త గర్వంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబు, మున్సిపాలిటీ అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాస్, కౌన్సిలర్లు ధరణికోట విజయలక్ష్మి, గోపాలరావు, మైలా సైదులు, కొత్తపల్లి ప్రకాష్, హైదర్,దాసు,దిలిప్, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top