నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు, కమిటి ఆర్గనైజింగ్ చైర్మన్ గా గుండు ముత్తయ్య గౌడ్.
NTODAY NEWS: భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం, వడాయి గూడెం గ్రామంలో గత 20 సంవత్సరాలుగా గ్రామ బొడ్రాయి సెంటర్ లో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించి ఘనంగా పూజలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా 2025 సెప్టెంబర్ శుక్రవారం రోజున నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న దుర్గామాత ఉత్సా కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుండు ముత్తయ్య గౌడ్,గౌరవ అధ్యక్షులు బబ్బూరి సురేష్ గౌడ్ , ముద్దసాని ఉపేందర్,నోముల నర్సింహ యాదవ్,ముఖ్య సలహా దారులు గుండు మనీష్ గౌడ్ , గౌరవ సలహాదారులు కళ్లెం కృష్ణ గౌడ్,శెట్టి గోపాల్ యాదవ్ , కోట ఆంజనేయులు, చందాదారుల కమిటి చైర్మన్ & వైస్ చైర్మన్ గా రాసాల నర్సింహ యాదవ్,జక్కుల చంద్రయ్య యాదవ్,కమిటి అధ్యక్షులుగా బబ్బూరి సుమన్ గౌడ్ (డుమ్ము),ప్రధాన కార్యదర్శి నీల ఆంజనేయులు గౌడ్ , కోశాధికారి గుండు రవి గౌడ్ , ఉపాధ్యాక్షులు కోట చంద్రశేఖర్ (సీఎం), కళ్లెం సాగర్ గౌడ్,కోల సందీప్ (బన్నీ),చుక్కల రామారావు యాదవ్,కోట లక్ష్మయ్య,సహాయ కార్యదర్శులు
బబ్బూరి పెద్ద సుమన్ గౌడ్ , పబ్బాల చిన్న వంశరాజ్,కంచన పల్లి రమేష్ గౌడ్,కోట నరేష్ ,కోట చిన్న స్వామి,ప్రచార కార్యదర్శి స్వర్గం శివ,బబ్బూరి దినేష్ గౌడ్ ,పబ్బాల సంజీవ వంశరాజ్ ,ఆర్గనైజింగ్ కమిటి సభ్యులుగా కోట ఉప్పలస్వామి, నోముల భాను యాదవ్,బబ్బూరి మురళి గౌడ్,కమిటి సభ్యుల నిధి సేకరణ (డబ్బుల సేకరణ) కమిటి చైర్మన్ గా మాటూరి శంకర్ గౌడ్ లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కంటి సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని , అందులో భాగంగా ఈ సంవత్సరం మమ్మల్ని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని , నూతన ఉత్సవ కమిటీ సభ్యులు చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటూ , దుర్గామాతను ప్రతిష్టించి దసరా మరుసటి రోజు నిమజ్జనం అయ్యేంతవరకు ఉత్సవ కమిటీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇబ్బందులు లేకుండా చూసు కుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నూతన కమిటీని పూల దండలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు.













