డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి — సిఐ నాగరాజు
NTODAY NEWS: జూన్ 23 రిపోర్టర్ కూనురు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో స్థానిక పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ యాంటి డ్రగ్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా చిట్యాల CI నాగరాజు, WPSI అమ్రీన్ , పోలీసు సిబ్బంది కలిసి మొక్కలు
మొక్కలు నాటి మాదక ద్రవ్యాలు వినియోగ వలన కలిగే ఆరోగ్య ప్రభావాలు, ఆర్ధిక, సామాజిక దుష్పరిణామాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చిట్యాల CI మాట్లాడుతూ. యువత విద్యార్ధులు మాదకద్రవ్యాలు లాంటి చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నారు. విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని అన్నారు. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటివి తీసుకుంటే ఆరోగ్యంపై పడే హానికర ప్రభావాలతో పాటు ఆర్ధిక నష్టాలు, సమాజంలో గుర్తింపు గౌరవం ఉండదని సూచించారు.ఈ డ్రగ్స్ నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలని అన్నారు.యవత,విద్యార్థులు మత్తు పదార్థాలకు, గంజాయికి దూరంగా ఉంటూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడల చిన్న మల్లయ్య, పోకల దేవదాసు, పరమేష్ మరియు చిట్యాల పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.













