నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు — సిఐ నాగరాజు
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో సిఐ నాగరాజు ఆధ్వర్యంలో నాకాబంధి నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడప రాదని నెంబర్ ప్లేట్లు లేకుండా, తిరిగితే వాహనాలను సీజ్ చేస్తామని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని , అలా ఇస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని సిఐ నాగరాజు హెచ్చరించారు, ఈ నాకాబంది నిర్వహణలో భాగంగా 20 వాహనాలను పట్టుబడ్డాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిట్యాల ఎస్ఐ ఎం ధర్మ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.