తొంట సత్యనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి
NTODAY NEWS: బొమ్మలరామారం, ఏప్రిల్ -3
మండలంలోని మునీరాబాద్ గ్రామానికి చెందిన తొంట సత్యనారాయణ బుధవారం రోజున ఔటర్ రింగ్ రోడ్డు కీసర సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి తీవ్ర గాయాలు కావడంతో (రాఘవేంద్ర) శ్రీకర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సత్యనారాయణను, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డిలు పరామర్శించారు. మరింత మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిమ్ముల సుదీర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మెన్ గుదే బాల నరసింహ, మండల అధ్యక్షుడు పోలోగోని వెంకటేష్ గౌడ్, మచ్చ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మైలారం రామకృష్ణ, మాందాల రామస్వామి, గొడుగు చంద్రమౌళి, బోనంకూర మల్లేష్, చీకటి మామిడి మాజీ ఉప సర్పంచ్ బొర్ర నరసింహ, మండల ఎమ్మార్పీఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.