కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు–సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్
NTODAY NEWS: తుర్కపల్లి మండలం
తుర్కపల్లి మండలంలో గురువారం రోజున శ్రీ గురు రాఘవేంద్ర ఆటో యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ జనరల్ బాడీ సమావేశం గుండెబోయిన బలరాం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్ హాజరై మాట్లాడుతూ పెట్టుబడుదారి విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ వారి కాలంలో కార్మికులు సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మిక వర్గాన్ని ప్రజలను పెట్టుబడుదారిదారులకు కంపెనీ యజమానులకు శ్రమను దోచుకోవడానికి అవకాశం కల్పిస్తుందని ఎలాంటి చట్టాలు సౌకర్యాలు కనీస వేతనాలు కల్పించకుండా యాజమానులు తన ఇష్టానుసారంగా పనిచేయించుకుంటున్నాయని అన్నారు కేంద్ర ప్రభుత్వం యాజమాన్యాలకు పెట్టుబడుదారులకు కొమ్ముకాస్తున్నాయని, రైతు నల్ల చట్టాలను తీసుకొస్తూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరకల్పించకుండా మార్కెట్ యార్డులు రైతుల రైతులు ప్రజల చేతులో భూమి లేకుండా కార్పొరేటు శక్తులకు పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి చూస్తున్నదని అన్నారు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సంపదను అంబానీ ఆదానీలకు కట్టబెడుతూ దేశంలోని ప్రజల ఆస్తులను లూటీ చేస్తున్నదని అని అన్నారు మేడే అమరవీరులు అనేక పోరాటాలు చేసిన హక్కులు సాధించిన వాటిని అమలు చేయకుండా వారి త్యాగాలకు విలువ లేకుండా చేస్తున్నాయని 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ గా చేస్తూ కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత కనీస సౌకర్యాలు లేకుండా చేస్తున్నారని అన్నారు అనంతరం నూతన అధ్యక్షునిగా గుండెబోయిన బలరాం, ఉపాధ్యక్షులుగా కట్కూరి వెంకటేశం, కోశాధికారి కొక్కొండ పోశయ్య ,కార్యదర్శిగా గుండెబోయిన రాజు, సలాదారునిగా గుండెబోయిన రమేష్, సభ్యులుగా డి వెంకటేశం, జి కరుణాకర్, కే శ్రావణ్, వి కనకయ్య, రుక్నాథం, జ్వాల నాయక్ ఎన్నుకోవడం జరిగింది.