ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు

Spread the love

నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన కూనురు మధును నల్గొండ జిల్లా ఆర్టీఐ రక్షక్ జిల్లా ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 పౌరులకు ఒక ఆయుధం గా ఉంటుందని, సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి అక్రమాలను బయటపెడతామని, మన సమాజ నిర్మాణం కోసం పాటుపడతానని సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించి సామాజిక బాధ్యత తెలిసే విధంగా చేస్తామని అన్నారు. అలాగే ఆర్టీఐ రక్షక్ సంస్థ లో జిల్లా, మండల కమిటీల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కళ్లెం చంద్రశేఖర్, ఉపేందర్ ఆర్టిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top