బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం–యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
N TODAY NEWS: భువనగిరి
మహిళా శిశు,దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ,యాదాద్రి భువనగిరి జిల్లా, వారి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా ఈ రోజు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల భువనగిరి ఆవరణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవ ర్యాలీ జెండా ఊపి ప్రారంబించారు.బాలకార్మిక నిర్మూలన దినోత్సవానికి సంబంధించిన పోస్టర్స్ మరియు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లడుతూ బాల కార్మిక చట్టాల గురుంచి మరియు కర్మగారాలు ఫ్యాక్టరీ,హోటల్స్,కిరాణ షాపులు,ఇటుక బట్టీలు,కోళ్ల ఫారాలలో 18 సంవత్సరాల లోపు బాలలను పనులలో పెట్టుకున్నట్లయితే యాజమనులపై కేసులు నమోదు అవుతాయని.ఒకవేళ పిల్లలను పనిలో పెట్టుకున్నట్లయితే 2 సంవత్సరాల జైలు శిక్ష 50 వేల రుపాయాల జరిమాన విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామాలలో,పట్టణాలలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు జరిపించాలన్నారు.అనంతరం జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు ర్యాలీలో పాల్గొని షాపు యజమానులు బాల కార్మికులను పనిలో పెట్టుకోకూడదని కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నాగిరెడ్డి,డిఐఈఓ రమణీ , జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పాపిరెడ్డి ,సిడీపిఓ శైలజ, జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మోయిజుద్దీన్ ,జిల్లా బాలల పరిరక్షణ విభాగం ,సఖీ విభాగం, డిఎల్ఎస్ఏ సిబ్బంది,జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది,స్కోప్ ఎన్జిఓ,అంగన్వాడీ టీచర్లు ,విద్యాశాఖ సిబ్బంధి , విద్యార్ధులు పాల్గొన్నారు.













