ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి

Spread the love

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్ర సిద్ధించడానికి అహింసా మార్గాన ఎన్నో పోరాటాలు చేసి భారతదేశం స్వతంత్ర సాధించడంలో గాంధీజీ ప్రముఖ పాత్ర వహించాడని , గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటిస్తూ భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శానిటేషన్ విభాగానికి చెందిన కార్మికులను శాలువాతో సత్కరించారు .ఈ సమావేశంలో కమిషనర్ పి వీరేందర్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, మరియు వార్డ్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు మున్సిపల్ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top