పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని,రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ చౌకధరల దుకాణం ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం ని పంపిణీ చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కు అండగా ఉండే ప్రభుత్వమని రేషన్ కార్డు ఉన్న ఒక్క మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నామని త్వరలో 30 లక్షల రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ఆహర భద్రత చట్టం ఇందిరా గాంధీ హయాంలో వచ్చిందని ఇప్పటికే 500 వందలకు గ్యాస్ సీలిండర్, ఉచిత బస్సు, 200 యునిట్ ఉచిత కరెంట్ లాంటి ఇసున్నాం అన్ని మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని , పేదలను ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఏల్లపుడు సిద్దం గా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలోని రేషన్ డీలర్లు ,పార్టీ శ్రేణులు , ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.