News Headlines

వనజీవి రామయ్య గారికి అవమానం

Spread the love

వనజీవి రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన నల్గొండ జిల్లా కుమ్మరి సంఘం కార్యదర్శి తాడూరి చంద్రం

(NTODAY NEWS) 

కూనురు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్

నలగొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన నల్గొండ జిల్లా కుమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి తాడురీ చంద్రం పద్మశ్రీ అవార్డు గ్రహీత తెలంగాణ ముద్దు బిడ్డ ఇంటి పేరుని వనజీవిగా మార్చుకుని వనజీవి ధరిపల్లి రామయ్య గారి స్వగృహం ఖమ్మం జిల్లా ఖమ్మం మండలం రెడ్డిపల్లి పట్టణము నందు వనజీవి రామయ్య గారి మృతికి సంతాపం తెలియజేశారు. వారి కుటుంబాన్ని పరామర్శించి వృక్షో రక్షితి రక్షిత: అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకొని కోటి మొక్కలు నాటిన మహానీయుడు. పర్యావరణం కోసం వారు చేసిన సేవలు కేంద్రం ప్రభుత్వం గుర్తించి 2017 లో పద్మశ్రీ అవార్డు తో సత్కరించిన విషయాన్ని గుర్తు చేస్తూ రామయ్య గారి చిత్రపటానికి పూలమాలతో సంతాపం తెలిపి ఇప్పుడున్న ప్రభుత్వం వనజీవి రామయ్య గారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకుండా అవమాన పరిచారు అని కుమ్మర సంఘం తరఫున నిరసన తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య గారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top