అన్ని దానల్లో కెల్లా.. రక్త ధనమే మిన్న..
NTODAY NEWS. లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
• వాకిటి లక్ష్మరెడ్డి 26వర్ధంతి సందర్బంగా మెగా రక్తదానం శిబిరం
• ఉత్సాహంగా పాల్గొని రక్త దానం చేసిన నర్సాపూర్ నియోజకవర్గ యూవత
•మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విద్య వికాస్ అవార్డులు అందజేత
•సునీతమ్మ స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు
•పాల్గొన్నా నర్సాపూర్ MLA సునీతా లక్ష్మరెడ్డి..బి ఆర్ యస్ నాయకులు
నర్సాపూర్ శుక్రవారం నియోజకవర్గ కేంద్ర పరిధిలోని కాంజర్ల ఫంక్షన్ హల్ లొ సునీతమ్మ స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వర్గీయ వాకిటి లక్ష్మ రెడ్డి 26 వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి అశేష స్పందన లభించింది గత 26 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నా రక్తదాన శిబిరం ద్వారా ఎంతోమంది నర్సాపూర్ యువత మరియు సునీత లక్ష్మారెడ్డి అభిమానులు భారీగా తరలివచ్చి రక్తదానం చేయడంజరుగుతుంది.. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం అని. అన్ని దానల్లో కెల్లా రక్త దానం ఎంతో ముఖ్యం అని సునీతా లక్ష్మ రెడ్డి తెలియజేసారు .. రక్త దాన శిబిరంలొ పాల్గొని తమ రక్తాన్ని దాతగా ముందుకు వచ్చి అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్టిఫికెట్ లు అందజేశారు.అదేవిందాంగ నియోజకవర్గంలోని కొన్ని 10వ తరగతిలొ మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విద్య వికాస్ అవార్డులు ప్రదానం చేసి వారిని సత్కరించారు. ఇ కార్యక్రమంలొ నియోజకవర్గ బి ఆర్ యస్ నాయకులు కార్యకర్తలు. మరియు సునీతమ్మ స్వచ్చంద సేవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.













