నల్లజర్ల మండలం, దూబచర్ల గ్రామంలోని వసంత కాలనీలో ఇటీవల సంభవించిన దుర్ఘటనలో బైరవపాటి వెంకటేశ్వరరావు ఇంటిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వారి ఇల్లు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఈ విషాదకర సంఘటన వల్ల బైరవపాటి వెంకటేశ్వరరావు కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది.ఈ నేపథ్యంలో, పార్డ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ, నల్లజర్ల శాఖ ఆధ్వర్యంలో వారి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. పార్డ్ ఇండియా జాతీయ అధ్యక్షులు బైరవపాటి వెంకటేశ్వరరావుని కలసి, వారి ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసిన 5000 రూపాయలు ఆర్థిక సాయం సభ్యుల సహకారతో అందజేశారు.. పార్డ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ తమ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.. ఈ సందర్భంగా అంబటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “అగ్నిప్రమాదం వంటి ఊహించని విపత్తుల్లో బాధితులకు అండగా నిలబడటం మా సంస్థ లక్ష్యం. బైరవపాటి వెంకటేశ్వరరావు కుటుంబానికి ఈ సహాయం ద్వారా కొంత ఉపశమనం కల్పించాలని భావిస్తున్నాము” అని పేర్కొన్నారు.ఈ ఆర్థిక సాయం ద్వారా బాధిత కుటుంబం తమ జీవనోపాధిని పునరుద్ధరించుకోవడానికి సహకరించాలని సంస్థ ఆకాంక్షిస్తోంది. ఈ కార్యక్రమంలో నల్లజర్ల శాఖ గౌరవ అధ్యక్షులు చీమకుర్తి కృష్ణ ప్రసాద్, ఎడ్యుకేషన్ అవేర్నెస్ చైర్మన్ బొందల శ్రీనివాసరావు, యోగ మిత్ర రాజారావు, సోమిశెట్టి వెంకటరావు, మదర్ థెరిస్సా అధ్యక్షులు డేవిడ్ పార్డ్ డైరెక్టర్ పెప్సీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
