బడి తరువాత విద్యా బోధన సెంటర్ ప్రారంభించిన పార్డ్ ఇండియా
దేవరపల్లి మండలం యర్నగూడెం ఎంపీపీ స్పెషల్ స్కూల్ నందు పార్డ్ ఇండియా ఇరాకాన్ ఆధ్వర్యంలో బడి తరువాత విద్యా బోధన సెంటర్ ను స్కూల్ ప్రాధనోపాధ్యాయులు నూతలపాటి ఆనందరావు పార్డ్ ఇండియా గౌరవ అధ్యక్షులు కారుమంచి గణేష్ ప్రారంభించి విద్యార్థులకు విద్యాసామాగ్రి అందించారు. హెచ్ఎం ఆనందరావు మాట్లాడుతూ పార్డ్ ఇండియా సంస్థ ద్వారా నిరుపేద విద్యార్థులకు విద్యాకుసుమాలు అందించడం అభినందనీయమని సంస్థవ్యవస్థాపకులు బేతాల వీరాస్వామి క్రింది స్థాయినుంచి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వచ్చారని సమాజంకోసం పలుసేవలు అందిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని అన్నారు. పార్డ్ ఇండియా గౌరవ అధ్యక్షులు కారుమంచి గణేష్ ఉపాద్యాయులు ఈశ్వర్ ధూళిపూడి రవీంద్ర సోమశెట్టి వెంకటరావు బేతాల నాగమణి విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొనారు.













