BREAKING
11,600 కి.మీ చెప్పులు లేకుండా నడిచిన నూతన దంపతులు.. 12 జ్యోతిర్లింగాల దర్శనం నక్కపల్లి మండలంలో అవినీతి ఆరోపణలు కంఠమహేశ్వర దేవాలయ హుండీలో చోరీ తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త చిట్యాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం ఇంధన ధరలు తగ్గించాలి.. తిరువూరులో సీపీఐ ధర్నా మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర 11,600 కి.మీ చెప్పులు లేకుండా నడిచిన నూతన దంపతులు.. 12 జ్యోతిర్లింగాల దర్శనం నక్కపల్లి మండలంలో అవినీతి ఆరోపణలు కంఠమహేశ్వర దేవాలయ హుండీలో చోరీ తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త చిట్యాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం ఇంధన ధరలు తగ్గించాలి.. తిరువూరులో సీపీఐ ధర్నా మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర
www.ntodaynews.com

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆర్టిఐ కమిషనర్

తెలంగాణ
23 Jun, 2025 - 07:43 PM
41 వీక్షణలు
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆర్టిఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి NTODAY NEWS:యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి సోమవారం రోజున దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా గర్భగుడిలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. మొదట స్వామివారి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చిన కమిషనర్ కు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆర్డిఓ, తాహసిల్దార్ మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆలయ స్వాగతం పలికి స్వామి వారి దర్శనం కల్పించారు. ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఏఈవో గజవెల్లి రమేశ్ బాబు, సూపరింటెండెంట్ రాజన్ బాబు లడ్డూ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫొటోను బహూకరించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యాదగిరి గుట్టలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పీఆర్వో దుడుక రామకృష్ణను ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి పరామర్శించారు. రోడ్డు ప్రమాద సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఐజేయూ జాతీయ కమిటీ సభ్యుడు కందుల శ్రీనివాసరావు, తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్ గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు. Follow us on Website Facebook Instagram YouTube