News Headlines

చిట్యాల లో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 316 వ వర్ధంతి

Spread the love

ఘనంగా నివాళులర్పించిన చిట్యాల గీతా కార్మికుల మరియు గౌడ సంఘం నాయకులు నాయకులు

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో బహుజన సామ్రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క 316వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు . వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కనకదుర్గ అమ్మవారి గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ పాపన్న ఆశయాల సాధన గురించి మాట్లాడినారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో తొలి తెలుగు బహుజన సామ్రాజ్య స్థాపకుడు సర్వాయి పాపన్న గౌడ్ క్షత్రియులే కత్తి పట్టాలి అన్న నానుడిని చరమగీతం పాడుతూ బహుజనులకు రాజ్యాధికారాన్ని ఎలా సంపాదించాలో నేర్పించాడని అగ్రకులాల ఆధిపత్యాన్ని అణచివేస్తూ సబ్బండ జాతులను ఏకం చేసి సామ్రాజ్యాన్ని సాధించాడని అన్నారు. 16వ శతాబ్దంలోనే తెలంగాణ ప్రాంతంలో పోరుబాటకు విత్తనాలు నాటిన మహాదీరుడని , జమీందారులు పెత్తందారుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రెంచ్ బ్రిటిష్ వంటి విదేశీయుల నుండి ఆయుధాలుకొని బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించాడని అన్నారు . గౌడ్ సాబ్ మొదట వరంగల్, భువనగిరి, అనంతరం గోల్కొండ కిలాలను ఆక్రమించుకొని విజయ పతాకం ఎగరవేశాడు అని మొగల్ సామ్రాజ్యం రాజుల్లో వెన్ను వనికించినటువంటి సర్వాయి పాపన్న గౌడ్ ఆశయం నెరవేర్చటంలో తాము సహకరిస్తామని సర్దార్ సర్వాయి పాపన్న చూపిన దారిలోనే నడుస్తామని అన్నారు ఈ కార్యక్రమానికి చిట్యాల గౌడ సంక్షేమ సంఘ అధ్యక్షులు మారగోని రమేష్ గౌడ్, కోశాధికారి రేగులగడ్డ నరసింహ గౌడ్, నకిరేకల్ నియోజకవర్గ సర్వాయి పాపన్న గౌడ్ గీత కార్మికుల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాసు గౌడ్, ప్రధాన కార్యదర్శి కాసుల సత్యనారాయణ గౌడ్, చిట్యాల మండల సర్వాయి పాపన్న గౌడ్ గీత కార్మికుల అధ్యక్షులు పంతంగి వెంకన్న గౌడ్, చిట్యాల పట్టణ సర్వాయి పాపన్న గౌడ్ గీత కార్మికుల అధ్యక్షుడు ఉయ్యాల మల్లేష్ గౌడ్, పట్టణ గౌడ పెద్దలు పొన్నం లక్ష్మయ్య గౌడ్,దేశగొని బాలరాజు గౌడ్, కాసుల రాములు గౌడ్, కాసుల శంకరయ్య గౌడ్, గుండాల సత్తయ్య గౌడ్, పల్లె వెంకన్న గౌడ్, కళ్లెం నరేందర్ గౌడ్ , మార్క నరసింహ గౌడ్, కొమ్మాగాని కృష్ణ గౌడ్, కూనూరు మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

 

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top