వెల్లంకి గ్రామంలో బడిబాట కార్యక్రమం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో విద్యార్థులను చేర్చుకోవడం కొరకు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నందుకు మండల విద్యాధికారి గవ్వజ్యోతి అభినందించారు అదేవిధంగా వెల్లంకి గ్రామం లో ప్రతి ఇంటిని వెళ్లి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని తల్లిదండ్రులకు తెలిపి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి మాట్లాడుతూ సెలవుల్లోనే ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళినప్పుడు వారి నుండి మంచి స్పందన వస్తుందని, సెలవుల్లో కూడా ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నందున గ్రామ ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి పులగం సులోచన గారు, మాజీ చైర్మన్ కర్రె రాజు గారు,ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి గారు, ఉయ్యాల బిక్షమయ్య గారు, దూదిగామ సువర్ణ గారు మంధుగుల వెంకటయ్య గారు, కొసనం మాధవి గారు పాల్గొన్నారు.