పేలుళ్లు దిగ్భ్రాంతికరం NTODAY NEWS: ప్రత్యేక కథనం దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో బాంబుపేలుడు దిగ్భ్రాంతికరం. 13 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు కావడం అత్యంత విషాదకరం. తమ పనుల్లో తలమునకలై ఉన్న అనేకమంది ఏం జరిగిందో తెలుసుకునేలోపే తమ చుట్టూ శరీర అవయవాలు తెగిపడి ప్రాణాలు కోల్పోవడమో, క్షతగాత్రులై హాహాకారాలు చేస్తూ పడిపోవడమో, అత్యంత భీతావహంగా ఆ ప్రాంతమంతా మారిపోయింది. భారీ విస్ఫోటనంతో భయపడి పరిగెడుతున్న తమపై మృతుల శరీర […]

