నల్లజర్ల మండలం, దూబచర్ల గ్రామంలోని వసంత కాలనీలో ఇటీవల సంభవించిన దుర్ఘటనలో బైరవపాటి వెంకటేశ్వరరావు ఇంటిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వారి ఇల్లు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఈ విషాదకర సంఘటన వల్ల బైరవపాటి వెంకటేశ్వరరావు కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది.ఈ నేపథ్యంలో, పార్డ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ, నల్లజర్ల శాఖ ఆధ్వర్యంలో వారి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. పార్డ్ ఇండియా […]