పాలకులు మారిన!! పాఠశాల దుస్థితి మారలే…
•శిదిలవస్థలో జగ్గంపేట ప్రాథమిక పాఠశాల,,
•ఒకే గదిలో ఐదు తరగతులా బోధన,,
•పాఠశాల ప్రాంగణంలోనే. క్రీడా ప్రాంగణం. పల్లె పకృతి వనం,,
•ప్రాంగణంలొ వేపుగా పెరిగిన పిచ్చి మొక్కలు,,
•రాత్రుల్లో మద్యం బాబులకు అడ్డగా పాఠశాల,,
•శిదిలవస్థలో ఉన్న భవనాన్ని కూల్చి.. కొత్త భవనం నిర్మించాలి??
•ఏంపిడిఓ కీ వినతిపత్రం అందజేసిన అమ్మ ఆదర్శ కమిటీ చేర్మెన్ సికింద్లపురం సంధ్య.గ్రామస్తులు
NTODAY NEWS: నర్సాపూర్
చిలిప్ చెడ్ మండలంలొని జగ్గంపేట గ్రామ పాఠశాల భవనం పూర్తిగా శిదిలవస్థకు చేరి ఒక భాగం కూలీపోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసారు..పాఠశాల దుస్థితిని చూసి తమ పిల్లలను పాఠశాలలొ చదివించాలి అంటే భయంగా ఉందని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నిత్యం భయంతోనే ఉంటున్నారని.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకి ఏక్షణమైనా ఏదయినా ప్రమాదం జరగవచ్చునని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు.. ప్రభుత్వ అధికారులు మరియు వివిధ పార్టీల నాయకులు స్పందించి తగుచర్యలుచేపట్టాలని పెద్ద ప్రమాదం జరగక ముందే పాత భవనాన్ని కూల్చివేసి నూతన భవనం నిర్మించే విదంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీడీఓ కీ పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చేర్మెన్ సికింద్లపూరం సంధ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు…
ఒకే గదిలో ఐదు తరగతులు!!
పాఠశాల భవనం ఒక భాగం ఇప్పటికే కూలిపోవడంతో మరో మిగతా భాగం శిదిలవస్తలో ఉండం గమనార్ధం విద్యార్థుల భద్రత కోసంమే ప్రస్తుతనికి మంచిగా ఉన్న ఒక గదిలో 1నుండీ 5తరగతుల విద్యార్థులకు కలిపే విద్యను బోదిస్తున్నాం అని.. ఇలా చెయ్యడం ద్వారా విద్యార్థులు కూడా సారిగా చదువుకొలేక పోతున్నారని పాఠశాల హెడ్ మాస్టారు శేఖర్. ఉపాధ్యాయురాలు మౌనిక పేర్కొన్నారు..
మద్యం బాబులకి అడ్డాగా మారిన పాఠశాల!!
పాఠశాలలొ రాత్రి వేళ మద్యం బాబులు తాగి కాలి బాటిల్లను అక్కడే పడవేసి వాటిని పగులకొడుతున్నారు శిదిలవస్తాగా మారిన భవనంలొ సిగరెట్ పీకలు. కాలి మందుసిసాలు దర్శనం ఇస్తున్నాయి.. వీటిని ఉదయనే పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయలు విద్యార్థులతో కలసి తొలగిస్తున్నారు.. రోజు ఇలాగే జరుగుతుండంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు మండిపాడుతున్నారు. పాఠశాలకీ సరయినా ప్రహరీ గొడ లేకపోవడంతో మద్యంబాబులు పాఠశాలని అడ్డాగా చేసుకొని ఇలాంటి కార్యకలాపాలకీ పాల్పడుతున్నారని అధికారులు మల్లి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టిగా తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు..
ప్రాంగణంలొనే పల్లె పకృతి వనం క్రీడా ప్రాంగణం!!
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనంతో పాటు క్రీడా ప్రాంగణాన్ని గ్రామంలో ఎక్కడ ప్రభుత్వ ఖాళీ స్థలం లేదని ఒక కుంటిసాకుతో నాటి గ్రామ పంచాయతీ పాలకులు. గ్రామ పంచాయతీ అధికారులు కలిసి పాఠశాల ప్రాంగణంలోనే ఏర్పాటు చేశారు… అన్ని గ్రామాలలో ప్రభుత్వ కాలి స్థలాలలో విశాలవంతంగా పల్లె ప్రకృతి వనం క్రీడా ప్రాంగణాలు ఉండగా. తమ గ్రామంలో ఉన్న పల్లె ప్రకృతివనం మరియు క్రీడా ప్రాంగణం ద్వారా తమకు ఎటువంటి ఉపయోగం లేదని గ్రామ యువకులు పేర్కొన్నారు.. పల్లె ప్రకృతి వనంలో పనికి వచ్చే మొక్కలని ఏర్పాటు చెయ్యకుండా..ఎటువంటి ఉపయోగంలేని మొక్కలని ఏర్పాటు చెయ్యడంతో వాటి మధ్య వేపుగా(గుబురుగా )పిచ్చిమొక్కలు పెరిగయానని. వర్షకాలం కావడంతో పాఠశాలలోకి విషపురీత ప్రాణులు, కిటకాలు వస్తున్నాయని విద్యార్థుల తల్లి దండ్రులు గ్రామ యూవకులు తెలియాజేశారు. పాఠశాల ప్రాంగణంలొ కూడా విపరీతంగా గడ్డి పెరగడంతో విద్యార్థులు ఆడుకోవడానికి ఇబ్బందిగా మారింది పేర్కొన్నారు .
Follow us on
Website
Facebook
Instagram
YouTube













