సత్యం, శాంతి మరియు అహింస తన ఆయుధాలుగా భారత దేశానికి స్వేచ్చా స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి నేడు – మొద్దు లచ్చిరెడ్డి

Spread the love

ఎల్బీనగర్ అక్టోబర్ 2 NToday న్యూస్ ప్రతినిధి.
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ ఫేస్ 1 .లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకలలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సంబరాలు నిర్వహించుకుంటామని. మహోన్నత స్వాతంత్ర్య సమర యోధుడు, అహింస శాంతియుత పోరాటాల ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి. సందర్భంగా ఆ మహనీయునికి మనస్సుమంజలి తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు, చేనేత మోర్చా కన్వీనర్ రఘురాం నేత, సాయిబాబా గుడి ఆలయ చైర్మన్ పర్వత్ రెడ్డి, కాలనీ జనరల్ సెక్రెటరీ సాయిరాం, ట్రెజరర్ నరేష్, నాగరాజ్ శర్మ,నాయకులు కామేష్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top