వట్లూరు గురుకుల పాఠశాలలో ముగిసిన శిక్షణా కార్యక్రమం

Spread the love

వట్లూరు గురుకుల పాఠశాలలో ముగిసిన శిక్షణా కార్యక్రమం 

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సంయుక్తంగా వట్లూరు గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమం నేటితో ముగిసింది. ఏలూరు జిల్లాలోని వట్లూరులో,జూన్ నెల రెండవ తారీఖు నుండి నాల్గవ తారీఖు వరకు మూడు రోజులు జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంకు జోన్-2 లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాల్స్ హాజరయ్యారు. శిక్షణా కార్యక్రమాలు నైపుణ్యాలను మరింత బలోపేతం చేస్తాయని వట్లూరు కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ నుండి శ్రీ.ప్రవీణ్ నాయుడు గారు, శ్రీ.తిరంగ్ గారు,ఏలూరు జిల్లా డి.సి.ఓ శ్రీ.ఉమా కుమారి గారు, కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి గారు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top