BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

విద్యకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జిల్లా కలెక్టర్

తెలంగాణ
01 May, 2025 - 08:53 AM
249 వీక్షణలు
విద్యకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ NTODAY NEWS: యాదాద్రి భువనగిరి ప్రతి విద్యార్థి ఏదో ఒక దశలో తనపై నమ్మకం పెంచుకుంటాడని భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిద్దుకుంటాడనే నమ్మకం ఉందన్నారు.పేదరికం రూపుమాపేందుకు విద్య ఒక్కటే మార్గం. ఒక్కొక్క విద్యార్థి ఒక్కో కుటుంబం అని మర్చిపోవద్దు.అందరూ ఉత్తీర్ణతతో 100% ఫలితాలు సాధించి ఉన్నత చదువు చదవాలన్నదే తన ఆకాంక్ష..అనుకున్న ప్రకారంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన 5 మందికి సైకిళ్ల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. వచ్చే ఏడాది ప్రతి కళాశాలలో నూటికి నూరు శాతం ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధిస్తే 50 సైకిళ్లు ఇస్తా...ఫలితాలు మెరుగుపరచాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో 98.09% సాధించిన ధీరజ్ కుమార్,అదే కళాశాలలో ఇంటర్ సి.ఈ.సి లో 91.60%శ్రేష్ట , ఒకేషనల్ కోర్స్ లో MLT లో 98.80% సాధించిన నందిని , వలిగొండ ఎస్.వి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపిసిలో 96.59% సాద్హించిన గంజి సరస్వతి,యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఇంటర్ హెచ్ఈసి లో 93.40% సాధించిన అభిలాషలను వారి తల్లిదండ్రులు తో సహా శాలువాలు కప్పి మెమెంటో లను అందించి అభినందించిన జిల్లా కలెక్టర్. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మండలాల కళాశాల ప్రిన్సిపల్స్ తో జిల్లా కలెక్టర్ హనుమంతరావు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సమాజాభివృద్ధికి విద్య ఎంతగానో దోహదం చేస్తుందని,అందుకు ప్రతి ఒక్కరూ చదువుకునేలా ప్రోత్సహిస్తానని ఆత్మవిశ్వాసం కల్పించి ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తానని,వారిఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుతానన్నారు. ఉపాధ్యాయులు ప్రతి ఒక్క విద్యార్థి కి మార్గదర్శకులు కావాలన్నారు. ప్రభుత్వ విద్య పట్ల విద్యార్థుల్లో నమ్మకం కలిగేలా అంకితభావంతో పని చేయాలన్నారు వారిలో మానసిక ధైర్యాన్ని కల్పిస్తూ విద్య పట్ల ఇష్టత కల్పించాలన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరిని ప్రభుత్వ కళాశాలలో చేరే విధంగా గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఫ్లెక్సీ, పాంప్లెట్ల ద్వారా అత్యధిక మార్కులు సాధించిన వారి వివరాలను పొందుపరిచి విస్తృత ప్రచారం చేపట్టి ప్రభుత్వ కళాశాలలో చేర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మండలాల వారీగా సంబంధిత ప్రిన్సిపల్స్ కళాశాలల వారీగా వచ్చిన శాతమే కాకుండా కళాశాలలో చదివిన వారందరూ ఉత్తీర్ణులవ్వాలని ఉన్నత విద్య అభ్యసించేలా కృషి చేయాలన్నారు మొదటి,రెండు సంవత్సరాలలో ఫెయిల్ అయిన విద్యార్థుల పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి వారిని చదివించి సప్లమెంటరీ పరీక్షలలో అందరూ పాసై డిగ్రీలో చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి,ఎస్సీ షెడ్యూల్ కులాల శాఖ అభివృద్ధి అధికారి వసంతకుమారి, ఇంచార్జ్ విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ,తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube