అంబేద్కర్ విగ్రహానికి 12వ వారం జ్ఙానమాల కార్యక్రమం..

Spread the love

అంబేద్కర్ గారి విగ్రహానికి 12వ వారం జ్ఙానమాల కార్యక్రమం..

NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ

కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి 12వ వారం జ్ఙానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ వార్డు సభ్యులు బిఆర్ఎస్ పార్టీ బీబీనగర్ మండలం ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆలోచన విదానాన్ని ఆశయాలను ప్రజల్లోకి తీసుకొనివెల్లడానికి ఈ జ్ఙనమాల కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందని నేటీ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుసరించాలని అంబేద్కర్ తన యొక్క జ్ఙానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని సబండ వర్గాల ప్రజలకు మేలు జరిగేవిందంగా రచించారని అన్నారు నేటి యువత అన్ని రంగాల్లో ముందుడాలని మహనీయుల అడుగు జాడల్లో నడవాలని అన్నారు . ప్రజలందరూ ఈ జ్ఙానమాల కార్యక్రమంలో ప్రతి ఆదివారం పాల్గొనాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొండమడుగు ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాడిగల్ల బాబు ఎంఆర్పిఎస్ బీబీనగర్ మండలం మాజీ అధ్యక్షులు మోల్గరం పాండు చిన్నగల్ల అశోక్ ,దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ బుశపాక మల్లెశ్, దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షులు మంద శ్రీశైలం, మాజీ వార్డు సభ్యులు మొల్గరం బాల్ నర్సింహ్మ,ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు చిన్నగల్ల లింగ స్వామి, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు చిన్నగల్ల శంకర్, మంద ఉప్పలయ్య, చిన్నగల్ల గణేష్, కాడిగల్ల భూపాల్,చిన్నగల్ల లక్ష్మీ నారాయణ, ఎంఆర్పిఎస్ మాజీ అధ్యక్షులు కాడిగల్ల సురేష్, ఎంఆర్పిఎస్ నాయకులు బొడ్డు శివ బాబు,మంద భాస్కర్, రొంపి శ్రీరాములు, మొల్గరం భరత్ చిన్నగల్ల రాము తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »