News Headlines

వికలాంగుడు సకలాంగులకు ఆదర్శం ఓ పెద్దన్న ప్రస్థానం

Spread the love

వికలాంగుడు సకలాంగులకు ఆదర్శం ఓ పెద్దన్న ప్రస్థానం

అంచెలు అంచెలుగా ఎదుగుతున్న ఓ.పెద్దన్న

డాక్టరేట్ పొందిన పెద్దన్నను ఘనంగసన్మానించిన ప్రజా సంఘాలు

(కూడేరు) ఏప్రిల్6 (NTODAY NEWS)
కూడేరు మండల కేంద్రంలో తమిళనాడు ఆసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో డాక్టరేట్ పొందిన పెద్దన్నను శాలువా కప్పి పూలమాలలు వేసి దళిత సంఘాలు నాయకులు ఘనంగ సన్మానించడం జరిగింది,ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ వికలాంగుడైన పెద్దన్నగత 30 సంవత్సరాల కాలం నుండి ఎంతో ఓర్పు సహనముతో ప్రజల సంక్షేమమే ప్రజాసేవే తన ఊపిరిగ భావించి ఎన్నో అష్ట కష్టాలకు ఎంతో ఓర్పు నేర్పులతో ప్రజల సంక్షేమ కొరకు వికలాంగుల హక్కుల సాధన కొరకు, విద్యార్థుల కొరకు,మహిళల్లో చైతన్యం తీసుకురావడానికివికలాంగులు సమాజంలో గౌరవింపబడే విధంగ ఎన్నో పోరాటాలు చేసిన వికలాంగుడు పెద్దన్నను తమిళనాడు ఆసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు గుర్తించి ఆయన సేవలను సమాజానికి మరింత తెలిపే విధంగ మరింత పనిచేసే విధంగ డాక్టరేట్ ప్రధానం చేయడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు,గతంలో కూడ పెద్దన్న ఎన్నో అవార్డులు రివార్డులు పొందారని వికలాంగుడైన సమాజ సేవలో ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగ నిలబడడం చాలా సంతోషకరమైన విషయం అని సంతోషాన్ని వ్యక్తం చేశారు, భవిష్యత్తులో మరిన్ని అవార్డులు రివార్డులు డాక్టరెట్లు పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు ఈసన్మాన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రాజు, విహెచ్పిస్ మండల అధ్యక్షులు చోళసముద్రము శ్రీరాములు, ఎంఎస్పి ఎంఆర్పిఎస్ నాయకులు సూర్యనారాయణ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాల ఈశ్వరయ్య, ఎస్సీ ఎస్టీ ప్రజాసామక్య మండల అధ్యక్షులు కమ్మూరు కుంటప్ప గారి వన్నూరప్ప, ఉపాధ్యక్షులు ముద్దలాపురం జన్నె ఆంజనేయులు, జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదినారాయణ,ఉపాధ్యక్షులు వెంకట్రాముడు, ప్రజా సంఘాల నాయకులు అరవకూరు రమణ,పాత్రికేయులు ఉరవకొండ నియోజకవర్గం ఆంధ్రప్రభ పిసి ఇంచార్జ్ ఎర్రిస్వామి, విశాలాంధ్ర లేఖరి ఎర్రి స్వామి, సిద్ధప్ప, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top