వట్టిమర్తిలో ఘనంగా పోషణ పక్షం కార్యక్రమం
ప్రభుత్వం పంపిణీ చేసే పౌష్టిక ఆహారాన్ని వినియోగించండి .– మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద
NTODAY NEWS
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న వట్టిమర్తి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో ఘనంగా పౌష్టికాహార పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద అన్నారు. ఈ సందర్భంగా నర్రా వినోద గారు మాట్లాడుతూ గర్భిణీలకు బాలింతలకు లబ్ధిదారులకు వివిధ రకాల పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించారు.పౌష్టికాహారం అందించడం వల్ల పుట్టిన బిడ్డ భవిష్యత్తుకు అది పునాది అవుతుందని తెలిపారు.అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు బూరుగు అరుణ ఇంద్ర గార్లు మాట్లాడుతూ గర్భిణీగా నమోదైనప్పటినుండి ప్రసవించిన తర్వాత బిడ్డకు రెండు సంవత్సరాల వయసు వచ్చేంతవరకు తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం చిన్నారులకు అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు బూరుగు అరుణ అక్కెనపల్లి ఇందిరా, ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జానకి,హెల్త్ అసిస్టెంట్ నాగరాణి గ్రామపంచాయతీ కార్యదర్శి పరమేష్, డాక్టర్ భవాని, ఆశా వర్కర్ రజిత,మరియు గర్భిణీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.