www.ntodaynews.com
25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రబృందం
తెలంగాణ
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
(NTODAY NEWS)
25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రబృందం
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-99 బ్యాచ్ పదవ తరగతి పూర్తిచేసుకుని 25 ఏళ్లు పూర్తి కావడంతో హోటల్ వివేరాలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమా తమకు చదువు చెప్పిన గురువులను ఆహ్వానించి గురువులతో కలిసి ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్, నకిరేకల్ నల్లగొండ, తదితర ప్రాంతాల్లో స్థిరపడిన 50 మంది పూర్వ విద్యార్థులు అందరు ఒకే వేదికపై కలుసుకొని స్నేహ భావాన్ని చూపించుకుంటూ అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం దివంగతులైన ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆత్మశాంతి కోసం నివాళులర్పించారు. పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మీ నరసింహారావు రాంప్రసాద్, కుకడాల గోవర్ధన్, పాలకూరి నోములు, యోగేంద్ర నాథ్ గార్లు జ్యోతిని వెలిగించి సిల్వర్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం గురువులకు శాలువా, పూలమాలలతో సన్మానించారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube