News Headlines
Chief Minister honours Chaganti at the Secretariat
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు
ప్రజల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ లో మార్పులు :- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో :-కలెక్టర్ బి.సత్య ప్రసాద్
రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సర్వేల్ -మర్రిగుడం గ్రామ ప్రజల దాహం తీర్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు:- చలమల్ల కృష్ణ రెడ్డి
అనుమానంగా ఉన్న వ్యక్తులు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచార ఇవ్వాలి: ఎస్ఐ జగన్
దుర్గాదేవి ఉత్సవాలు సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థాన్:- ఎస్ఐ జగన్ సూచించారు

బొమ్మలరామారం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ చేస్తున్న క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాలి– ప్రజా పోరాట సమితి

Spread the love

బొమ్మలరామారం మండలంలో పరిమితికి మించి జిలెటిన్ స్టిక్స్ వాడుతూ హై బ్లాస్టింగ్ చేస్తున్న స్టోన్ క్రషర్ల మీద కేసులు నమోదు చేయాలని ప్రజా పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బొమ్మలరామారం ఎస్ఐ శ్రీశైలంకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీస శ్రీనివాస్, మైలారం జంగయ్య మాట్లాడుతూ క్వారీల్లో వాడే పేలుడు పదార్థాలకు లెక్కుకు మించి వాడుతున్నందున వారి మీద పరిశీలన చేసి కేసులు నమోదు చేయాలని కోరారు.బ్లాస్టింగ్ ఎక్కువ మోతాదులో చేయడం వల్ల రాయి దుమ్ము గ్రామాలను అంధకారంలో ముంచెత్తుతున్నాయని,మందు గుండు వాసనకు ఊపిరి ఆడటం లేదని తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.అసలు బ్లాస్టింగ్ అనుమతులు ఎంతవరకున్నాయో తనిఖీ చేయాలని, అప్పుడు వారి అసలు బాగోతం బయటపడుతుందన్నారు.అతి భారీ బ్లాస్టింగ్ బారినుండి ప్రజలను కాపాడాలని కోరారు. అధిక లోడుతో లారీలు మూలమలుపుల వద్ద కంకర కింద పడడంతో వాహనదారులు కింద పడుతున్నారు,రాళ్ళు ఎగిరి తలలకు తగులుతున్నాయని క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వట్టిపల్లి సుదర్శన్,సహాయ కార్యదర్శి మైలారం సుదర్శన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top