జె ఆర్ సి కాలేజ్ లో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు
NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట
ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్ల వైద్య
ఆరోగ్యశాఖ జిల్ల ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారం తో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట లో సోమవారం కృష్ణ వెన్నె ల మహిళ సొసైటీ. సి బి ఓ.ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు ప్రతినిధి అయినటువంటి బి ప్రసాద్ మాట్లాడుతూ.హెచ్.ఐ.వి ఎయిడ్స్ వ్యాధి కారకాలు ఎలా వ్యాపించదు.హెచ్ఐవి యొక్క లక్షణాలు అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవా లో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల.పట్ల వివక్ష చిన్న చూపు లేకుండా సమాజం లో ఎలా కలిసి జీవించాలో హెచ్ఐవి ఎయిడ్స్ క్షయ వ్యాధి సంబంధం గురించి సుఖ వ్యాధులు మరియు చికిత్స గురించి హెచ్ఐవి యాక్ట్ – 2017 ఆర్ట్ మందులు. అపకేస్. టోల్ ఫ్రీ నెంబర్ బీ 1097 గురించి తెలుపుతూ మీ ద్వారా తెలియని వారికి తెలియ పరచడం
జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జేఆర్సీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ కే ఎన్ రమేష్.. ఇంచార్జ్ వి దుర్గాప్రసాద్.. సహకారం తో జేఆర్సి కాలేజీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించటం జరిగింది దీనిలో కేవీమ్స్ సిబ్బంది మరియు పీర్ ఎడ్యుకేటర్స్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఆర్సి కాలేజ్ కే ఎన్ రమేష్ బి దుర్గాప్రసాద్ మరియు కాలేజ్ విద్యార్థులు జగ్గయ్యపేట పీ.ఎం ప్రసాద్ ఓ .ఆర్ . డబ్ల్యు రుక్మిణి ఓ. ఆర్. డబ్ల్యు రవి పి రెడికేటర్ ఎస్.కె. సైదాబి తదితరులు పాల్గొన్నారు.













