విద్యతోపాటు విద్యార్థులు క్రీడారంగంలో రాణించాలి.

Spread the love

విద్యతోపాటు విద్యార్థులు క్రీడారంగంలో రాణించాలి.

NTODAY NEWS:పెద్దకాపర్తి, నల్గొండ జిల్లా

విద్యార్థులు విద్యతోపాటు క్రీడారంగంలో కూడా రాణించాలని జిల్లా విద్యాశాఖ ఫైనాన్స్ ఎకౌంట్స్ ఆఫీసర్ యోగేంద్రనాథ్ అన్నారు. సోమవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నల్గొండ వారి ఆధ్వర్యంలో మండలంలోని పెద్దకాపర్తి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన మండల స్థాయి టోర్నమెంట్ మరియు సెలెక్షన్ కార్యక్రమాన్ని ఆయన మండల విద్యాధికారి సైదా నాయక్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు, అండర్ 14, 17 స్థాయి విద్యార్థినీ విద్యార్థులకు కబడ్డీ, కోకో, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విజేతలను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్దకాపర్తి ప్రధానోపాధ్యాయులు పి. శ్రీధర్ మరియు ఉపాధ్యాయులు లూకెందర్ రెడ్డి, యశోదర రెడ్డి, కైలాష్, లచ్చి రెడ్డి, యాదగిరి రెడ్డి,రవీందర్, విజయలక్ష్మి, యుగంధర్ రెడ్డి, బ్రమ్మయ్య, శ్రీదేవి, రమణ, జానకి, గఫ్ఫార్, జోజి రాణి, శంబులింగం రాము చిట్యాల మండలం పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »