భారీ జన సందోహం మధ్య… వైయస్ జగన్ జన్మదిన వేడుకలు!
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు బ్రెడ్లు పంపిణీ
NTODAY NEWS: ఆమడగూరు రిపోర్టర్ రామాంజనేయులు
శ్రీ సత్యసాయి జిల్లా అమడుగురు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జననేత జగనన్న 53వ జన్మదినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు , పెద్ద ఎత్తున మండల కేంద్రానికి తరలివచ్చి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ జన సందోహం మధ్య ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక వైఎస్ఆర్ సర్కిల్లో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తనకంటి జయప్ప ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రాంతంలో బారి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు ,బ్రెడ్లు పంపిణీ చేశారు. మండలంలోని తుమ్మల పంచాయతీలోని సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జననేత జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని జెకేపల్లి, మహమ్మదాబాద్, పలు గ్రామాల్లో జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జననేత జగనన్న నిరుపేద సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. జగనన్న పేద ప్రజల కోసం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు యావత్తు దేశం జగనన్న మార్గంలోని నడుస్తుందన్నారు. మళ్లీ నిరుపేదల ముఖాలలో చిరునవ్వులు చూడాలంటే జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శేషురెడ్డి,మాజీ జెడ్పిటిసి పోట్టా పురుషోత్తం రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శివశంకర్ రెడ్డి, సర్పంచులు లక్ష్మీనరసమ్మ, సురేందర్ రెడ్డి, శంకర, ఆదినారాయణ, మోహన్ రెడ్డి, ఎంపిటిసిలు నాగరాజు,సురేందర్ రెడ్డి, లక్ష్మీపతి, శ్రీరాములు, నారాయణ, పెద్దపయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి మధుసూదన్ రాజు, మాజీ మండల్ కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి, జిల్లా బూత్ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు సేవేనాయక్ , మండల యూత్ అధ్యక్షులు ఎస్పాల్, మండల మహిళా అధ్యక్షురాలు గంగులమ్మ, జిల్లా డాక్టర్ విభాగం అధ్యక్షులు రమేష్, మండల అధ్యక్షులు ఉత్తప్ప,మండల వాలంటరీ సంగం అధ్యక్షులు సురేష్, మండల ఎస్టి సెల్ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయక్, టౌన్ కన్వీనర్ సుధాకర్ రాజు, కో ఆప్షన్ మెంబర్ కాజా పీరా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రామాంజనేయులు, నక్కల చిన్నప్ప, లోకేశ్వర్ రెడ్డి, బొట్టు స్వామి, వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.













