ఎలుకపడిన నీళ్లు తాగి అస్వస్థకు గురైన అంగన్వాడీ పిల్లలు
NTODAY NEWS: నర్సాపూర్
•మెరుగైన వైద్యం కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికీ తరలింపు
•విషయం తెలుసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లలను పరామర్శించిన స్థానిక నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి..
నర్సాపూర్ శివంపేట మండలం రత్నాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శనివారం ఉదయం 8 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అంగన్వాడి కేంద్రంలో తాగడనికి ఉంచిన నీటిబిందెలొ ఎలుక పడడంతో వాటిని చూడకుండా తగిన అంగన్వాడీ విద్యార్థులు అస్వస్థకకి గురికగా బిందెలో చనిపోయిన ఎలుకను గమనించిన కొందరు విద్యార్థులు విషయాన్ని అంగన్వాడీ టీచర్ కు తెలియజేసరూ..వెంటనే అప్రమత్తమైన అంగన్వాడీ టీచర్ వారి సిబ్బంది, హుటా హుటిన నర్సాపూర్ ఏరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిల్లలకి పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది ఎవరికి కూడా ప్రమాదం జరగలేదని చెప్పారు.. ఆదివారం ఇ ఘటన విషయాన్ని తెలుసుకున్న స్థానిక నర్సాపూర్ శాసన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ ప్రభుత్వ ఏరియాల్ దవాఖానలొ ఉన్న బాధిత విద్యార్థులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.. పిల్లలకు అవసరమైతే మెరుగైన వైద్యాన్ని అందించాలని స్థానిక వైద్య సిబ్బందిని ఆదేశించారు ఘటనపై పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.













