యోగా పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
NTODAY NEWS
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యోగ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతినిత్యం యోగా సాధన చేయాలని ఆయుష్ డిపార్ట్మెంట్ చిట్యాల హోమియో డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తయ్యబా అన్నారు. చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయుష్ డిపార్ట్మెంట్ హోమియో డిస్పెన్సరీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఉన్నందున ప్రతినిత్యం యోగా సాధన చేసుకునేందుకుగాను అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు యోగా చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ సాధన చేయాలని ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. విద్యార్థులు నిత్యం చదువు పట్ల ధ్యాస నిలిపేందుకు ధ్యానాన్ని సాధన చేయాలని సూచించారు యోగా శిక్షకులు బజరంగ్ ప్రసాద్ వైష్ణవిలు పలు యోగాసనాలను ప్రదర్శించి వాటి సాధన తో కలిగే ప్రయోజనాలను ఫలితాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోగి కార్ మాధవి, ఫార్మసిస్ట్ సరిత, జానకి, ఉపాధ్యాయులు మధుమతి శ్రీనివాస్ పద్మజ కోణం శ్రీనివాస్ కవిత సైదులు ప్రసన్న శైలజ శంకరయ్య సౌమ్య శ్రీనివాస్ తిరుమల తదితరులు పాల్గొన్నారు.