ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించాలి

Spread the love

ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించాలి– తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్

NTODAY NEWS: చౌటుప్పల్ వివిధ రోగాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ అన్నారు. మంగళవారం రోజున చౌటుప్పల్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించారు. హాస్పిటల్ లోనీ మెడికల్, క్యాజువాలిటీ, ఐసీయూ, మెడికల్ కేర్, జనరల్ సర్జికల్ వార్డు, మెడికల్ స్టోర్, డయాలసిస్, ఏక్స్ రే తదితర వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్,తదితరులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కావలసిన అన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ హస్పటల్ స్థితిగతులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.హాస్పటల్ ను పరిశీలించిన తర్వాత సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్పిటల్ నిర్వహణ తీరు మంచిగా ఉందని కొనియాడారు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ తో మాట్లడారు. కాంట్రాక్టర్ కమిషనర్ కు నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయని త్వరగా పనులు పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుందని కాంట్రాక్టర్ వివరించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్, హాస్పిటల్ సూపర్డెంట్ చిన్నా నాయక్,డిప్యూటీ డిఎంహెచ్ఓ యశోద సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »