జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలొ చిలిప్ చెడ్ బిఆర్ఎస్ నాయకులు,
NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ మెదక్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్
★ఎమ్మెల్యే సునీతా లక్ష్మరెడ్డితో కలసి ఎర్రగడ్డలొ ప్రచారం
★మాగంటి సునీతా గోపినాథ్ గెలుపే లక్షంగా డోర్ టు డోర్ ప్రచారం
★కెసిఆర్ పదేళ్ల అభివృద్ధి. రేవంత్ రెండేండ్ల విధ్వంసం పై ఓటర్లకు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించిన నాయకులు..
జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ మరణంతో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మరెడ్డితో కలసి ఎర్రగడ్డ డివిజన్ లొ డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు అలాగే చిలిప్ చెడ్ మండల బిఆర్ఎస్ నాయకులు గల్లీ గల్లీ తిరుగుతూ మాగంటి సునీతా గారిని గెలిపించాలని. ఈ ఎన్నికలో కాంగ్రెస్ కు ఓటుతో బుద్ది చెపితేనే నాలుగు కోట్ల ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు జరుగుతుందని లేని పక్షంలో రేవంత్ విధ్వంసపు పాలనతో జూబ్లీహిల్స్ గల్లీలోకి హైడ్రా వస్తదని ఓటర్లకు తెలియజేసారు. పదేండ్ల కెసిఆర్ అభివృద్ధి కావాలి అంటే కారు గుర్తుకు ఓటు వెయ్యాలని.. రెండేండ్ల కాంగ్రెస్ రేవంత్ విధ్వంసంతో కూడిన పాలన కావలొ మీ చేతుల్లో ఉండని.. మీరు వేసే ఓటుతో నాలుగు కోట్ల ప్రజలకు కూడా మంచి జరగబోతుందని చదువుకున్న యూవకులు చాలా మంది జూబ్లీహిల్స్ లొ ఉన్నారని మీరు ఇచ్చే తీర్పు కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్నాదని.. జూబ్లీహిల్స్ ఎన్నిక రేవంత్ సర్కారుకు ఒక ఎదురు దెబ్బ కావాలని అందుకే మీరందరూ కారు గుర్తుకు ఓటు వేసి సునీతా గారిని గెలిపించాలని చిలిప్ చెడ్ మండల బిఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేస్తు ప్రచారం నిర్వహించరు ఇ కార్యక్రమంలొ చిలిప్ చెడ్ మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు పాటోళ్ల అశోక్ రెడ్డి. బిఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు సికింద్లపూరం పోచయ్య మరియూ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.













