సత్య సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

Spread the love

సత్య సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

NTODAY NEWS: భువనగిరి

సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా భువనగిరి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం భువనగిరి బస్టాండ్ లో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ పాల్గొని మాట్లాతూ. మజ్జిగ శరీరంలోని వేడిని తగ్గిస్తుందని, జీర్ణవ్యవస్థ కు మేలు చేసే బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుందని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరూ ఎండాకాలం లో తప్పనిసరిగా మజ్జిగను తీసుకోవాలని ఆయన కోరారు. మజ్జిగ తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్,అల్సర్,గుండెల్లో మంట తదితర సమస్యలకు ఉపశమనం కలుగుతుందని,అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయన అన్నారు.భువనగిరి సత్యసాయి సేవా సమితి సభ్యులు ప్రజలకు, ప్రయాణికులకు అందించే సేవలు చాలా గొప్పవని, సమితి సభ్యులను అభినందించారు. ఈ గురువారం మజ్జిగ దాత చొల్లేటి లక్ష్మి నరసింహ రావు, వీరు నాగేందర్, విఫణి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు సోమ కృష్ణమూర్తి, కట్టా మహేష్, ఆర్టీసీ స్టేషన్ మేనేజర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top