ముఖ్యమంత్రి సహాయక నిది.. కొండంత భరోసా
NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
••4,88,000 రూపాయల CMRF చెక్కుల పంపిణి
••లబ్ధిదారులకు అందజేసిన నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆవుల రాజి రెడ్డి
సోమవారం కొల్చారం మండల కేంద్రంలొ మండలనికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయక నిది CMRF ద్వారా మంజురైనా 4,88,000 రూపాయల విలువైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాలను అర్ధం చేసుకొని ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందజేయడం నా బాధ్యత అని. కాంగ్రెస్ ప్రభుత్వం పేదప్రజా అభివృద్ధికీ కట్టుబడి ఉంది. న్యాయం సంక్షేమం అందించడమే మా ప్రభుత్వ ద్యేయం అని పేర్కొన్నారు.. CMRF చెక్కులను అందుకున్న లబ్ధిదారులు. తాము ఎదురుకొంటున్న ఆరోగ్య మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఈ సహాయం ఎంతో భరోసానిస్తుందని, ముఖ్యమంత్రికీ కాంగ్రెస్ ప్రభుత్వనికి, అలాగే తమకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ఆవుల రాజి రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేజారు. ఈ కార్యక్రమంలొ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.













