చెరువు పనులను ప్రారంభించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
(NTODAY NEWS) ఏప్రిల్ 9
కూనురు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో 1 కోటి 18 లక్షల ఊర చెరువు మరమ్మతు పనులను తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన స్వగ్రామమైన ఉరుమడ్ల గ్రామానికి లింకు గ్రామాలైన. చిన్న కాపర్తి , ఉరుమడ్ల ఎలికట్టే రోడ్డు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు అంతేకాకుండా గ్రామంలోని అంగన్వాడి సెంటర్లకు త్వరలో శంకుస్థాపన చేస్తామని అన్నారు ఈ కార్యక్రమమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మి నర్సింహ జిల్లా కాంగ్రెస్ నాయకులు &మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, వనమా వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సైదులు, మాజీ MPTC పోలగోని స్వామి,సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు , చిట్యాల మండల్ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉయ్యాల నవీన్ కుమార్ గౌడ్ , సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, ఉద్యమ నాయకులు జనపాల శ్రీను, యాదవ సంఘం అధ్యక్షులు బొడ్డు శ్రీను, ఉయ్యాల నరేష్, మర్రి రమేష్ మర్రి శ్రీకాంత్ ,నడిoపల్లి గోపాల్, గుత్తా రవీందర్ రెడ్డి ,మేడబోయున శ్రీను, గంగాపురo వెంకన్న,అనంతుల శంకర్, నడిoపల్లి నర్సింహ, వేలిమినేటి హరీ ప్రసాద్, పెద్దగోని మల్లయ్య ఏలికట్టె గ్రామ మాజీ ఉప సర్పంచ్ సాగర్ల యాదయ్య ఉయ్యాల నవీన్, బద్ధుల యాదయ్య, జల్లెల నర్సింహ ,రవి తదితరులు పాల్గొన్నారు.