ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు.
NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా, మైలవరం
పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. జి.కొండూరు, మైలవరం, వెల్వడం గ్రామాల్లో కేకులను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే దృఢమైన ఆశయంతో జనసేన పార్టీ నెలకొల్పి పవన్ కళ్యాణ్ విస్తృతంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రవహించే ఉత్తేజం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అన్నారు. నేటి యువత వారిని ప్రేరణగా తీసుకోవాలన్నారు. పలువురికి వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎన్డీఏ కూటమి నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.













