బహుజన కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టర్ పి. ప్రావీణ్య IAS గారిని కలిసి తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన కళాక్షేత్రానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, ఒగ్గు కళా సామ్రాట్, డా. చుక్క సత్తయ్య గారి పేరు పెట్టాలని బహుజన కులాల ఐక్యవేదిక ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్బంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ కీలకమైన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు. సబ్బండవర్ణాల కళాకారులకు ఆమోదయోగ్యమైన ఈ విషయం మీద తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షులు, శ్రీ యెగ్గే మల్లేశం కురుమ ఎమ్మెల్సీ, మరియు ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు, బీర్ల ఐలయ్య గారి సంఘీభావ పత్రాలు అందజేయడం, రెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని కలిసి యావత్ తెలంగాణ రాష్ట్ర బహుజన కళాకారుల చిరకాల ఆకాంక్షను స్వయంగా వివరించి డా. చుక్కా సత్తయ్య కళాక్షేత్ర నామకారణాన్ని ఆమోదించేలా ప్రయత్నం చేస్తానని పెద్దలు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బహుజన కులాల ఐక్యవేదిక ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పాల్గొన్నాయి.