విద్యాశాఖ నిబంధనలు పాటించాలి.— టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు
కొరకొప్పు రామారావు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 24/04/2025 నుండి ప్రైవేట్ స్కూల్ లకు వేసవి సెలవుల ఇచ్చిన దృష్ట్యా, అంతేకాక, ఈ సంవత్సరం తీవ్రమైన ఎండలు ఉన్న దృష్ట్యా విద్యా శాఖ నిబంధనలు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు కొరకొప్పు రామారావు అన్నారు.ఈ సందర్భంగా కొరకొప్పు రామారావు మాట్లాడుతూ, ఈ సంవత్సరం తీవ్రమైనఎండలు ఉన్నాయని, ప్రతి రోజు 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, ఇటువంటి సమయంలో ప్రైవేట్ టీచర్స్ ను అడ్మిషన్ పేరుతో కానీ క్యాంపైన్ పేరుతో గాని ఇంటింటికి తిప్పవద్దని అన్నారు.
ఒక్కసారి వడి దెబ్బ తగిలితే పది రోజులు ఇబ్బంది పడతారని కాబట్టి ఇటువంటి ఎండల్లో క్యాంపైన్ తిప్పవద్దని అన్నారు. ఒకవేళ క్యాంపైన్ తిరిగే సమయంలో ఏదైనా ప్రమాదం టీచర్స్ కు సంభవిస్తే దానికి పూర్తి బాధ్యత ఆయా స్కూల్ యాజమాన్యాలే భాద్యత వహించాలని అన్నారు. విద్యాశాఖ నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్స్ పైన, యాజమాన్యం పైన ,జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు
తీసుకోవాలని అన్నారు. క్యాంపెయిన్ సమయంలో ప్రమాదవశాస్తూ ఏ ప్రైవేట్ టీచర్ ఐన చనిపోతే 20 లక్షల వరకు ఆయా స్కూల్ యాజమాన్యాలు నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు.