ప్రజా పాలనలో అందరికీ ఆహార భద్రత దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం

Spread the love

సన్న బియ్యం పథకం పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలచిపోవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా మంగళవారం రోజు యాదగిరిగుట్ట మండలంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేద, ధనిక అనే తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు పేర్లు చేర్పించడం జరిగిందన్నారు. కొత్త రేషన్ కార్డు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని దేనిని అన్నారు. 210 కోట్లతో గంధమల్ల తో పాటు బస్వాపురం పూర్తి చేసుకోవడం జరుగుతుందన్నారు.5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నామని చెప్పారు. మహిళల కోసం ఐదు లక్షలతో ఇల్లు కట్టించడం జరుగుతుందన్నారు. ఉచిత బస్సు, రైతు బీమా,రైతు భరోసా,గ్యాస్ సిలిండర్ లను తమ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. మహిళ లకు ఉచిత బస్సు సౌకర్యం కోసం కల్పించిన ఘనత మా ప్రభుత్వానిదని అన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం అనే మరో అద్భుత పథకం తీసుకువచ్చిందని,ఈ పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు ఏప్రిల్ 14 వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల వరకు స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉందని, అందువలన నిరుద్యోగ యువతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ కూడా కట్టిస్తున్నామన్నారు.తమ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలను ఇప్పటివరకు భర్తీ చేసిందని అన్నారు.ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రైతుల పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రభుత్వం 2వేల 858 కోట్లు ఖర్చు చేసి ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున ప్రతి ఒకరికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, మహిళల ను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని,ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రారంభించిన ముఖ్యంగా ముందుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తుందని,అందులో భాగంగా మొదటిగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ,ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీలు ద్వారా ప్రతి ఒక్క అర్హులకు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని, ప్రతి ఒక్క కుటుంబానికి 500 కే గ్యాస్ ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్క అర్హులైన పేద కుటుంబానికి ఇంటికి 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో మహిళలను చైతన్యం పర్చుతూ ముందంజలో ఉండేలా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ప్రభుత్వం వచ్చాక ఎన్నో బ్రిడ్జిలు నిర్మించి ఆలేరు నియోజకవర్గంలో 120 చెరువులు నింపి పంటలు సమృద్ధిగా పండించుకుంటున్నామని అన్నారు. నీళ్లు,నిధులు,నియామకాలు అనేదే ప్రభుత్వ లక్ష్యమని దానికి అనుగుణంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని అన్నారు.
భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం లో బాగంగా చేపడుతున్న పేదలకు సన్న బియ్యం పంపిణీ గొప్ప కార్యక్రమమని, పేద ప్రజలు దొడ్డు బియ్యం తినలేక పోతున్నారని , పేద ప్రజల కడుపు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని దానికి అనుగుణంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని, అదేవిధంగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ఆర్థికంగా ముందుకు ఎదగాలన్నారు.జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ముందుగా ఈరోజు సన్న బియ్యం అందుకోబోతున్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇళ్లు అంటే మహిళా, మహిళ అనేది ఇంటికి ఒక బాధ్యత, ఇంట్లో ప్రతి బాధ్యతలను అన్ని మహిళలకే తెలుసు కాబట్టి గతంలో పరిస్థితి ఇప్పుడు పరిస్థిది ఆలోచించి దొడ్డు బియ్యం తినలేక పేద ప్రజల ఇబ్బందులను గమనించి జిల్లాలో 515 రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం అందించి పేదలు కడుపు నిండా అన్నం తినే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, ఎంత ఖర్చు అయినా పేద ప్రజలకు కావలసింది అన్నం, బట్టలు, ఇండ్లు కావున వారి కడుపు నింపడమే ప్రభుత్వం ఒక లక్ష్యమని , ఇండ్లు లేని ప్రతి పేదలకు ఇందిరమ్మ ఇండ్ల ద్వారా పేదలకు అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ పేదలందరూ సంతోషంగా కడుపు నిండా తినాలనే సంకల్పం ప్రభుత్వ ఆశయం అని అందుకోసం మన జిల్లాలో 515 రేషన్ షాపుల ద్వారా 2 లక్షల 16 వేల 904 రేషన్ కార్డుల ద్వారా 6లక్షల 76 వేల 188 మంది లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ అందించడం జరుగుతున్నది, దొడ్డు బియ్యం తినలేక ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారని, ప్రభుత్వం పేద వారి కోసం ఆలోచించి ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.రైతులు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి 500 రూపాయలు బోనస్ ఇచ్చి అనేక రైతాంగాన్ని నుంచి కొనుగోలు చేసి ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క లభిధరులకు ఈ సన్న బియ్యం అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో ధాన్యాన్ని కొనుగోలు చేయదని మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు.
అనంతరం ఆలేరు నియోజకవర్గం లో స్వయం సహాయక సంఘాలు 4028 ఉన్నాయని బ్యాంక్ లింకేజి 249.92 కోట్ల రూపాయల చెక్ ను మహిళా సంఘాల సభ్యులకు మంత్రి అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, భువనగిరి డిసిపి, మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనముంతల విమల వెంకటేశ్వర్లు,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి , డిసి ఎస్ ఓ వనజాత, డిఎం సివిల్ సప్లై హరికృష్ణ, సంబంధిత తహసిల్దార్లు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top