నర్సాపూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Spread the love

నర్సాపూర్ లొ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి!!

NTODAY NEWS: లక్ష్మిప్రసాద్. మెదక్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్

బుధవారం నర్సాపూర్ పట్టణంలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకట స్వామి.. నియోజకవర్గం కేంద్రంలొ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక పంపిణీ కార్యక్రమంతో పాటు నర్సాపూర్ పట్టణంలో వైకుంఠధామం ప్రారంభోత్సవం చేశారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. నర్సాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మంత్రి. నిరుపేదల సొంతింటి కలలు నెరవేరుస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో దాదాపుగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను కూడా ప్రభుత్వం సరాపర చేస్తుందని మంత్రి తెలియజేశారు. రాబోయే రోజుల్లో నర్సాపూర్ నియోజకవర్గాన్ని అన్ని దశల్లో అభివృద్ధి చేస్తామని జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాటుపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »