News Headlines

నష్టపోయిన పంట పొలాలు, మామిడి తోటలను సందర్శించిన ప్రభుత్వ విప్

Spread the love

నష్టపోయిన పంట పొలాలు, మామిడి తోటలను సందర్శించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

NTODAY NEWS: తుర్కపల్లి, ఏప్రిల్ 04

అకాల వర్షానికి తుర్కపల్లి మండలంలో అతలకుతులం అయిన వ్యవసాయ పంటలను, మామిడి తోటలను శుక్రవారం రోజున ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సందర్శించారు.ఈ అకాల వర్షం వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి,వడ్లు, మామిడితోటలో మామిడి కాయలు నెలరాలయి, దీంతో ఆ రైతులను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఓదార్చారు. వారి పంట పొలాలను మామిడి తోటలో కలయ తిరుగుతూ సందర్శించి ప్రభుత్వంవైపున ,తాను అండగా ఉంటామని ధీమా అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కలెక్టర్ హనుమంతరావుకి చరవాణి ద్వారా రైతుల ఆవేదనను తెలిపారు.నష్టపోయిన వివరాలు సేకరించి,నష్టపరిహారం అందిచాలని తెలిపారు.ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ గురువారం కురిసిన వర్షాలకు తుర్కపల్లి మండలంలో భారీగా నష్టము వాటిల్లిందని తెలిపారు.దయ్యంబండ, తుర్కపల్లి, మంచి రోని మామిళ్లు గ్రామాల్లో పంట పొలాలు, మామిడి తోటల్లో తీవ్ర నష్టం జరగటం బాధాకరమన్నారు. కలెక్టర్ కి సంబంధించిన అధికారులు నష్ట పోయిన పంటను అంచనా వేసి అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు అందిచాలని తెలిపారు.ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు ధనావత్ శంకర్ నాయక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top